Home » Adilabad
మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరులోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వారు మాట్లా డుతూ దొరలకు పాలేరుగా ఉండడంతో అందించిన భూమిని రెండేళ్ళ క్రితం వరకు సాగు చేసుకుని జీవిస్తుండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అభి వృద్ధి పేరిట తమ భూములను బలవంతంగా లాక్కుందన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్ష్యంలో మూడు వంతుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, మరో 30వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వేంపల్లి గ్రామం ఇండస్ర్టియల్ హబ్గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ర్టియల్ హబ్ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు.
మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపహాడ్ శివారులో ఇండస్ర్టియల్ హబ్ కోసం పేద రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం ముల్కల్లలోని దళిత రైతులను కలిశారు. ఆయన మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి, పోచంపహాడ్లో ఇండస్ర్టియల్ పార్కు కోసం సుమారు 295 ఎకరాల భూమి సేకరణకు ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అనుచరులు గ్రామాల్లోని దళిత రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి రిటైర్డు కార్మికులు సింగరేణి క్వార్టర్లలో విద్యుత్ పునరుద్ధరించాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్ కనెక్షన్ను తొలగిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని, నియోజకవర్గంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు. మంగళవారం మల్లంపేటలో పలు గ్రామాలకు సంబంధించి రూ. 1.10 కోట్ల నిధులతో 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ నిర్మాణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
సొంత ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంలో పడింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు వృథాగా పడి ఉన్నాయి.
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఊత్కూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు మాట్లాడుతూ యేటా రైతుకు పంట పెట్టుబడికి రూ.15వేలు ఇస్తామంటూ ఏడాది అనంతరం రూ.12వేలు ఇస్తామనడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు అమలు సందర్భంగా ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు.
సామాన్య మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా ముల్కల్ల పంచాయతీలోని వీరాంజనేయ గ్రామ సంఘం రాజరాజేశ్వరి చిన్న సంఘం సభ్యురాలు సుద్దాల విజయ పొందిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు.