Home » AP CID
Posani : ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. జైలుకు తరలించారు. అయితే పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. అందుకోసం ఆయనను మరోసారి విచారణకు ఇవ్వాలని కోర్టుకు సీఐడీ కోరనుంది.
p v sunil kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్పై విచారణలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను సీఐడి అధికారులు కార్యాలయానికి పిలిపించారు. ఆ క్రమంలో ఆయన వద్దనున్న సాక్ష్యాలను వారు తీసుకున్నారు. అలాగే ధరణికోట వెంకటేష్, దారపనేని నరేంద్రతోపాటు సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును సైతం సీఐడీ కార్యాలయానికి రావాలని సూచించారు.
Andhrapradesh: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1 గా ఉన్న వైసీపీ నేత పానుగంటి చైతన్య కస్టడీ ముగియడంతో ఈరోజు (సోమవారం) ఏపీ సీఐడీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చైతన్యను మూడు రోజుల పాటు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాడికి సంబంధించి పలు ముఖ్య విషయాలను సీఐడీ పోలీసులకు చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది.
మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.
మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఏపీ బేవరెజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ, వైసీపీ పెద్దలు, వారి బినామీల ఆస్తులపై సీఐడీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లోపెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..