Share News

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 09 , 2024 | 11:31 PM

మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.

 మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, సెప్టెంబరు 9: మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు. సోమ వారం పట్టణంలోని కృష్ణానగర్‌, ఇం దిరానగర్‌లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పర్య టించారు. ఈ సందర్బంగా ఆ ప్రాం తంలో తాగునీటి సమస్య ఉందని, కాలువలు శుభ్రం చేయించాలని, వీధి దీపాలు వేయించాలని ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్‌ అధికారులతో మాట్లాడుతూ సాధ్యమైనంత తొందరగా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. తాగునీటి సమస్యను యుద్ధప్రా తిపదికన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 11:31 PM