Home » Ashok Gajapathi Raju
Ashok Gajapathi Raju: రుషికొండపై జగన్ నిర్మించిన అరాచక భవనం ఓ తెల్ల ఏనుగుతో సమానమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని పిచ్చాస్పత్రికి కేటాయిస్తే మంచిదని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.
సింహాచల దేవస్థానం, అనుబంధ ఆలయ అంశాలపై అధికారులతో విశాఖలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింద్ర ప్రసాద్, దేవదాయ శాఖ అధికారులు, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొ్న్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు.
మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయన విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. సీఎం జగన్ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా చతికిలబడిపోయిందని కొణతాల మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి విజయం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఒక్కో బస్సును రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు..
విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..
విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.
రాజవంశీయులంటే విలాసవంతమైన జీవితే గుర్తొస్తుంది. అందులోనూ కేంద్ర మంత్రిగా పనిచేస్తే మరింత లగ్జరీగా జీవితం గడుపుతారని అందరూ భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా గడుపుతుంటారు రాజవంశీయుడు, సీనియర్ పొలిటీషన్ ఒకప్పటి కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు.