Home » Atchannaidu Kinjarapu
Andhrapradesh: ఎన్నికల్లో ఓటమి ఖాయమని టిక్కెట్ల దుకాణానికి జగన్ రెడ్డి గ్యాంగ్ తెరలేపిందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటూ అవినీతి సొమ్ముతో నెగ్గుకురావచ్చని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఒక వైపు ఓటర్లకు గిఫ్టులు పంచుతూ మరోవైపు అభ్యర్ధుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారన్నారు.
చిలకలూరిపేటలో మూడు పార్టీలు తలపెట్టిన ఉమ్మడి సభ నిర్వహణ కమిటీలతో సమావేశం ప్రారంభమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.
టీడీపీ దెబ్బకు ఆర్టీసీ దిగివచ్చింది. చిలకలూరిపేట సభకు ఎన్ని బస్లు కావాలో ఇండెంట్ ఇవ్వాలని టీడీపీని కోరింది. చిలకలూరిపేట సభకు తమకు బస్లు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
ఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడికి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బాబాయి బాత్రూం మర్డర్ కేసు మిస్టరీ వీడుతుందనే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ తెలుసుకోవాలన్నారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. సీట్ల సర్దుబాటు అంశంపై కొద్ది సమయంలో బీజేపీ పెద్దలతో చర్చించి ఉమ్మడి ప్రకటన చేస్తామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని గ్రహించి తమ సహకారం కోసం బీజేపీ పెద్దలు ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు. గతంలో అమిత్ షా, నడ్డాను కలిసి అవగాహనకు వచ్చామని వివరించారు.
Andhrapradesh: చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాల్సిందే అని.. సభకు బస్సులు కావాలని ఈ రోజు లెటర్ పెడుతున్నామని, బస్సులు ఇవ్వకపోతే ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Andhrapradesh: వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో సంపాదించింది చాలక పేదలు భూమలు లాక్కుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి తుమ్మలగుంటలో హాథీరాంజీ మఠం స్థలంలోని పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులపై సీఎం జగన్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు.
ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగసంఘాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.