Home » Congress 6 Gurantees
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
CM Revanth Reddy: ఒక్క సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయని… మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చిట్టీ రాసిస్తే చాలు తాను కొడంగల్కు వచ్చి అన్నీ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్రెడ్డి మాటిచ్చారు.
MP Laxman: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు.
KCR: బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.
Minister Komatireddy Venkat Reddy: పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు అసలు శిక్షలే సరిపోవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పదిలక్షల అబద్ధాలు ఆడారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.
Minister Seethakka: రైతు బోనస్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వ బోగస్ చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. వరి వేస్తే ఉరి అన్నది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో రూ.56,083 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ఇదే పథకాలకు చేసిన కేటాయింపులు రూ.49,315 కోట్లు కాగా చేసిన ఖర్చు చూస్తే రూ.24,948కోట్లు.
MP Balram Naik : రేవంత్ ప్రభుత్వంలో రైతులకు బోనసులు కూడా ఇచ్చామని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. సీఆర్ హయాంలో మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఎంపీ బలరామ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పారు.
Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. పేపర్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. వారి సంక్షేమానికి కృషి చేయాలని బండి సంజయ్ కుమార్ కోరారు.