Home » Godavari
గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 39.5 అడుగులుగా ఉంది. దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా మారింది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా.. పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పెద్దమొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది. గంట గంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 30.680 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసింది
ఇండియాలోని పెద్ద నదుల్లో గోదావరి (River Godavari) ఒకటి. మహారాష్ట్రలో పుట్టి ఎన్నో ప్రాంతాలను దాటి బాసర వద్ద తెలుగు నేలపైకి అడుగిడుతుంది గోదారమ్మ.
గోదావరిలో గల్లంతైన ముగ్గురు యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కే గంగవరం మండలం కూళ్ళ వద్ద గోదావరి నది ఒడ్డున పుట్టినరోజు వేడుకల అనంతరం స్నానాలకి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.