Home » IAS
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరింత చిక్కుల్లో పడ్డారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసి, అర్హత లేకున్నా ఓబీసీ, పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్ పరీక్షలో ప్రయోజనం పొందారనే కేసులో గురువారం ఢిల్లీ కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది.
దివ్యాంగులను అవమానపరిచిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(IAS officer Smita Sabharwal)ను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెను అరెస్ట్ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్రావు(Kolli Nageshwar Rao) డిమాండ్ చేశారు.
జీఐఎస్ సర్వేలో పౌరుల నుంచి సేకరిస్తున్న భవనాలు, నీటి, విద్యుత్బిల్లుల సమాచారం గోప్యంగా ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) తెలిపారు. ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలు సిబ్బంది తీసుకోరని సిబ్బంది అడిగినా ఇవ్వొద్దని పేర్కొన్నారు.
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్పై యూపీఎస్సీ వేటు వేసింది. ట్రైనీ ఐఏఎ్సగా ఆమె ఎంపికను రద్దు చేయడంతో పాటు జీవితంలో మళ్లీ అన్ని ప్రవేశ పరీక్షలు/యూపీఎ్ససీ సెలెక్షన్స్లో పాల్గొనకుండా
బిల్డింగ్ బేస్మెంట్లో వరదు నీరు ముంచెత్తి ముగ్గురు ఐఏఎస్ ఆశావహులు మృతి చెందిన కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న రావూస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ ఎట్టకేలకు బుధవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించింది. తమ ముగ్గురు స్టూడెంట్ల మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు చీవాట్లు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వ ''ఉచితాల సంస్కృతి''ని తప్పుపట్టింది.
ఈనెల 27న రాజేందర్ నగర్ రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరదనీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అదనపు కమిషనర్ తారిక్ థామస్ స్పందించారు. అభ్యర్థుల మృతికి తమ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. మా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.