Home » JC Prabhakar Reddy
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Andhrapradesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. తాడిపత్రిలో టియర్ గ్యాస్ ఎఫెక్ట్ వల్లే జేసీ అనారోగ్యానికి గురయ్యారు. ఆందోళన కారులను చెదరగొట్టడంలో భాగంగా నిన్న కాంచన ఆసుపత్రి సమీపంలో పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే జేసీ ప్రభాకరరెడ్డి సమీపంలో టియర్ గ్యాస్ పడింది.
తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కిరణ్ను వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికివేశారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని ఇతర ప్రాంతాలకు పోలీసులు తరలించారు.
తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్ ప్రభాకర్ రెడ్డిపై ED ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నిన్న(సోమవారం) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ సమయంలో వైసీపీ (YSRCP) పలు అల్లర్లు, అరాచకాలు సృష్టించింది. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ మూకలు పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగడుతున్నాయి. తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.
తాడిపత్రి ప్రజలే మా కుటుంబానికి దేవుళ్లు... నిస్వార్థంగా సేవచేయడం తప్ప మరేమిచ్చినా జేసీ ఫ్యామిలీ వారికి రుణం తీర్చుకోలేదు..’ అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు.. ఫ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? అశ్మిత: ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మా నాయన చేసిన అభివృద్ధే తప్ప ఈ ఐదేళ్లల్లో పాల..
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో బస్సుయాత్ర
Andhrapradesh: మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు అనేక సార్లు చెప్పామన్నారు.