Home » Kangana Ranaut
సినీ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తాజాగా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు అయ్యారని పేర్కొన్నారు.
'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని మండిలో శుక్రవారంనాడు రోడ్షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్గానో, స్టార్గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు.
లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి సినీ నటి కంగనా రనౌత్ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మండి ఎంపీగా కాంగ్రెస్కు చెందిన ప్రతిభా సింగ్ ఉన్నారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు. తన వయసు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె అధిష్టానానికి తెలిపారు. అయితే బీజేపీ అనుహ్యంగా కంగనా రనౌత్ పేరును ప్రకటించడంతో ఆమె నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్(Kangana Ranaut)ను ప్రకటించినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు అంశాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనెత్, హెచ్ఎస్ అహిర్ కంగనా టార్గెట్గా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) స్పందించింది.
ఎలాంటి బిడియం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే అతికొద్ది మంది సెలెబ్రిటీల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె తన సినిమాల పరంగా కన్నా, వివాదాస్పద విషయాల్లోనే నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు.
మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను వ్యతిరేకించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సినీ నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపింది. మహిళలు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారని.. తమ కుటుంబం, కమ్యునిటీ, దేశం పట్ల...
ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు బాలీవుడ్ నటి కంగన రనౌత్ సంకేతాలిచ్చారు. కృష్ణ భగవానుడు ఆశీస్సులుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ప్రఖాత ద్వారక ఆలయాన్ని కంగనా రనౌత్ శుక్రవారంనాడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womans Reservations Bill) ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్(Kangana Ranaut), ఈషా గుప్తా(Esha Gupta)లు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఇరువురు నటులు ఇవాళ పార్లమెంటుకు వచ్చారు.
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో తెలిసిందే. తన సినిమా ప్రమోషన్ అయినా, వ్యక్తిగత విషయాలైనా, ఎవరినైనా నిలదీయాలన్నా ముక్కుసూటిగా సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతుంటారామె!
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు వరుసగా లేడీ ఓరియెంటేడ్ చిత్రాలు చేస్తూ బీ టౌన్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.