Home » Kolikapudi Srinivasa Rao
Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీకి సమస్యగా మారింది. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈరోజు తిరువూరు నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడంతో చర్చనీయాంశంగా మారింది.
తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హిట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
TDP Tiruvuru Issue: తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోపెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు.
Kolikapudi Srinivas: కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ దృష్టి సారించింది. అయితే ఇప్పటికే కొలికపూడి విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇప్పటికే అనేక ఆరోపణలతో వివాదాస్పదమైన ఆయన.. అలవాల రమేష్ రెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై గిరిజన యువకులు, మహిళలు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రమేష్ రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధిస్తున్నాడంటూ టీడీపీ కార్యకర్త డేవిడ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Kolikapudi Srinivas: ‘‘ఆ వైసీపీ కుటుంబ సభ్యులు నన్ను టార్గెట్ చేశారు.. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్పై గతంలో ఆ కుటుంబసభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారు’’ అని కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సోమవారం ఉదయం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆ పార్టీ నాయకత్వం తాఖీదు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్(MLA Kolikapudi Srinivas)పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ (TDP) రంగం సిద్ధం చేస్తోంది. మహిళపై దాడి ఘటన నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి సోమవారం హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.