Home » Manipur
కొత్త భవనంలో ప్రారంభమైన తొలి రోజు నుంచే మణిపూర్ అల్లర్ల(Manipur riots)పై అట్టుడుకుతున్న పార్లమెంటు సమావేశాలు(Sessions of Parliament) మరో మలుపు తీసుకున్నాయి.
మణిపూర్ హింసపై చర్చిందేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఉభయసభల విపక్ష నేతలకు లేఖ రాసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. మంగళవారంనాడు లోక్సభకు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, చర్చకు సహకరించేందుకు వారు (విపక్షాలకు) సముఖంగా లేరని, దళితులపై కానీ, మహిళల సంక్షేమంపై కానీ ఏమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు.
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
మణిపూర్లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్లోని జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి.
మయన్మార్ నుంచి ఆయుధాలతో మణిపూర్కు టెర్రరిస్టులు వస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు.
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలని.. మణిపూర్ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్నారు. రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది.
రెండు జాతుల మధ్య వైరంతో కల్లోలితంగా మారిన మణిపూర్(Manipur) రాష్ట్రంలో పోలీసుల ముందు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండున్నర నెలలుగా జరుగుతున్న హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
మణిపూర్లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ ఘటనపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు సోమవారం కూడా దద్దరిల్లింది.
మణిపూర్ లో రెండు నెలల క్రితం మొదలైన మొదలైన హింసాకాండకు తెర పడటం లేదు. శాంతియుత నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతించడంతో సోమవారంనాడు ర్యాలీ నిర్వహించిన పలువురు మహిళలు కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ నివాసం వద్దకు రాగానే కట్టుతప్పారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు.