Home » MLC Elections
MLA Quota MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో సీఎంను కలిసి తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. మరి ఎమ్మెల్సీ సీటు ఎవరికి దక్కుతుందో..
Alapati Raja: కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. గుంటూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నుంచి డిక్లరేషన్ ఆయన అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
MLC Results: ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా సాగే ఎమ్మెల్సీ కౌంటింగ్లో అభ్యర్థి విజయాన్ని ఎలా నిర్దారిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రేపు ఉదయానికి తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ పూర్తైన తర్వాత బీఎస్పీ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానపోటీ జరిగినట్లు తెలుస్తోంది.
ఏపీలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. తూర్పు, పశ్చిమగోదావరి స్థానంలో కూటమి అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు.
MLC Elections Results 2025: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. భారీ మొత్తంలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.
ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని.. ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్లలో ఒక్క బూత్లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు.
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. వైసీపీ మద్దతు తెలిపిన పీడీఎఫ్ అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారు.
కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.