Home » NEET Paper Leak 2024
Telangana: విద్యార్థి, యువజన సంఘాల నేతల రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడంతో రాజ్భవన్ ముట్టడికి నేతలు బయలు దేరారు.
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
నీట్-పీజీ పరీక్షల(NEET - PG Exams) కొత్త షెడ్యూల్ను మరో రెండు రోజుల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) శనివారం వెల్లడించారు.
నీట్ పరీక్ష నిర్వహణలో(NEET Paper Leakage) అవకతవకలఅంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన నీట్ పేపర్ లీక్ కేసులో బాధితులకు న్యాయం దిశగా తొలి అడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి పట్నాలో ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి(Subramanian Swamy) గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై విమర్శలు గుప్పిస్తున్నారు.
విశాఖ: నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ..
నీట్ పరీక్షను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee) కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి(PM Modi) సోమవారం లేఖ రాశారు.