Home » Patancheru
పటాన్చెరు(Patancheru)లోని వాల్యూ జోన్ వద్ద జంక్షన్ పనుల కారణంగా నగరానికి మంజీరా(Manjira) నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్బోర్డు(Waterboard) ప్రకటించింది. ఈనెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపింది.
మృత్యువు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం అనడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యమేమో! ఏ వాహనం నుంచి ఊడిందో ఏమో ఓ టైరు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టగా..
పటాన్చెరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ మహిళ మాటలు నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
కాంగ్రె్సలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి.. సోమవారం సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రె్సలో చేరారు.
కొంతకాలంగా పార్టీ మార్పుపై ఊగిసలాడుతున్న పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం దానం నాగేందర్తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా.. స్థానిక నేతలకు దానం నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్లో చేరేందుకు దారి క్లియర్ అయ్యింది.
దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.
రాష్ట్రంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.
బీఆర్ఎ్సకు మరో షాక్ తగలనుందా? పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీజేపీలో చేరుతారా? ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా? అంటే.. మహిపాల్రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు.