Home » Patancheru
భాగ్యనగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్లోని ఓ గోల్డ్ షాప్లో రాబరికి యత్నించారు.
మైనింగ్ పేరుతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి(Gudem Mahipal Reddy) అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ(ED) ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే.
పటాన్చెరు(Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy), ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరార్మించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Ex Minister Harish Rao). గూడెం బ్రదర్స్ ఇళ్లలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి పటాన్చెరులోని ఆయన నివాసం, పట్టణంలోని శాంతినగర్లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్రెడ్డి,
తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఐటీ, ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది.
వివాహేతర సంబంధాన్ని నిలదీస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చింది ఓ తల్లి. కుమారుడిని గొంతు నులిమి చంపేసి.. ఆపై ప్రియుడితో కలిసి బాలుడి మృతదేహాన్ని పారేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈ దారుణం జరిగింది.
హైదరాబాద్లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWS&SB వెల్లడించింది. శేర్ లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.
హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..