Home » Ponnam Prabhakar
కరీంనగర్: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చలేదని, విభజన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదని మంత్రి పొన్నం ప్రబాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ను ఉద్దేశించి ప్రశ్నించారు.
కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు.
Telangana: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షకు పూనుకున్నారు. ఏప్రిల్ 14న దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలపై పొన్నం దీక్ష చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇచ్చిన వాళ్ళనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ‘‘మాకు ఒక్క వేలు చూపిస్తే.. మేం నాలుగు వేళ్ళు చూపెడుతాం’’ అని అన్నారు.
జగిత్యాల: మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్? అంటూ ప్రశ్నించారు.
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్కు మొబైల్ ఫోన్తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయన సంభాషణల ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో పొన్నంకు ఫోన్ గండం ఉందనే టాక్ నడుస్తోంది.
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ టికెట్ను హైకమాండ్ మళ్లీ పెండింగ్లోనే పెట్టింది. ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు మధ్య పోటీ నెలకొంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం నాడు జహీరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు.
హైదరాబాద్: ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే
కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండే పిల్లర్లు కుంగాయాని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.