Home » Singanamala
మండలంలో చిరుతల సంచారం పెరిగింది. కొండ ప్రాంతాల్లో చిరుతలు.. మూగజీవాలపై దాడులు చేసి, చం పుతున్నాయి. దీంతో రైతులు, గొర్రెల కాపర్లు.. మూగజీవాలను కొండ ప్రాం తాలకు మేత కోసం తీసుకెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈనెల 6న గోవిందరాయునిపేట సమీపంలోని మాల కొండ వద్ద ఎద్దుల సూరికి చెందిన గొర్రెల మందపై రెండు చిరుతలు దాడి చేశాయి. రెండు గొర్రెలను చంపే శాయి.
కోరిన కొర్కెలు తీర్చే కొండమీద రాయుడు స్వామి హనుమద్వాహ నంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదో రోజు హనుమద్వాహ న సేవ ఆదివారం నేత్ర ప ర్వంగా సాగింది. ఉద యం స్థానిక అంజినేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తుల కు వేద పండితులు ప్ర త్యేక పూజలు నిర్వహిం చారు.
స్థానిక కొండమీద రాయు డు స్వామి బ్రహోత్సవా లు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ్ఞఅందులో భాగంగా నా లుగో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు శేష వాహ నంపై భక్తులకు దర్శనమి చ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలోనే ప్రజల సహకారంతో సంక్షేమం, అభివృ ద్ధి అమలు చేస్తూ, సుపరిపాలనను అందిస్తున్నామని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీనగర్ వద్ద బుడగ జంగాల కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, గోకులం షెడ్డును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ పేర్కొ న్నారు. ప్రజా పాలన అందిస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మండల పరిధిలోని సిద్దరాంపురం పంచాయతీలోని ఎ. కొండాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆమె సోమవారం ప్రారం భించారు.
గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామీణ రోడ్లకు నేటికీ మోక్షం లేకుండా పోతోంది.. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశయా నికి గత పాలన చర్యలు గండి కొడుతున్నాయి. ఫలితంగా సంక్రాంతి ముగిన ప్పటీకి ఈ రోడ్లకు మోక్షం లేకుండా పోయింది. మండలంలోని శింగనమల రోడ్డు నుంచి గోవిందరాయునిపేట వెళ్లే రోడ్డుకు వైసీపీ పాలనలో కంకర వేసి ఆర్ధంతరంగా నిలిపివేశారు.
వైసీపీ పాలనలో చేపట్టిన భూ రీసర్వేలో రైతుల భూ విస్తీర్ణానికి సంబంధించి భారీ వ్యత్యాసాలు వచ్చాయనే విమర్శలు వచ్చాయి. దీంతో చాలా చోట్ల రీసర్వే వద్దన్నారు. అయినా పాల కులు అధికాలు బలవంతంగా భూ రీసర్వే చేపట్టి, వ్యత్యాసాలతోనే జాయింట్ ఖాతా నంబర్లు, ఎల్పీ నంబర్లతో భూహక్కు పుస్తకాలను సంబంధిత రైతుల కు ఇచ్చి, అలాగే వైబ్ల్యాండ్లో నమోదు చేశారు.
కూటమి ప్రభుత్వం రాకతో పల్లెల రూపురేఖలు మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల నిధులు పక్కదారి పట్టడంతో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం వీధిలైట్ల మరమ్మతులు చేయించుకోలేని దుస్థితిలో పంచాయతీలు ఉండేవి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే గ్రామీణ సమస్యలపై దృష్టి సారించింది.
పరిశుభ్రమైన వాతవర ణం గ్రామాల అభివృద్ధికి తోర్పడుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించా రు.
మండల కేంద్రమైన నార్పల క్రాసింగ్ వద్ద 18 ఎకరాల విస్తీర్ణంలో ఈనెల 18, 19 తేదీలలో జరిగే ఇజ్తమా ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెతో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ... 12 సంవత్స రాల తరువాత నార్పలలో ఇజ్తమా ఏర్పాటు చేశామని, ఇందులో 25వేల 30వేల మంది పాల్గొంటారని వారు తెలిపారు.