Home » Singanamala
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
Andhrapradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండల్లోనే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రోజుల వ్యవధే ఉండటంతో ఎండలను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మండే ఎండల్లో ప్రచారం నిర్వహిండచంతో పలువురు అభ్యర్థులు కాస్త అనారోగ్యానికి గురవుతున్నారు..
రాయలసీమలో అత్యంత ఆసక్తికర పోరు నడిచే నియోజకవర్గాలు అనగానే టక్కున గుర్తొచ్చేవి కడప, పులివెందుల రాజకీయాలు. వీటితోపాటు అనంతపురం జిల్లా శింగనమల రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ఉండనుండగా.. శింగనమలలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
శింగనమల వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియామకంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే యామిని బాల, నార్పల సత్యనారాయణ రెడ్డి, వైసీపీ కీలక నేతలు రాజన్న, మిద్దె కుళ్లయప్ప, గోకుల్ రెడ్డి తదితరులు అసమ్మతి వర్గంగా ఏర్పడి సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని అధికార వైసీపీ భావిస్తుంది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది.
సినీ హీరో అల్లు అర్జున్కు టీడీపీ జిల్లా నాయకులు రాయలసీమ రుచులతో విందు ఇచ్చారు. టీడీపీ శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఈ విందు ఏర్పాటు చేశారు.