Home » Weather
IMD Weather Updates: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల భౌగిళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులు(Weather Changes) ఉంటాయి. ఒకదేశంలో వర్షాలు(Rains) పడుతుంటే.. మరో దేశంలో ఎండలు(Heat Waves) దంచుతుంటాయి. అయితే, మనం దేశంలో మాత్రం ప్రాంతానికొక విధంగా వాతావరణం..
ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు(Heat wave) కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది.
Andhra Pradesh Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం(Weather) మారిపోయింది. మొన్నటి వరకు ఎండలు(Summer Temperature) దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడింది. పలు చోట్ల వర్షాలు(Rains) కూడా కురుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది.
ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా వేసవి ( Summer ) ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఉదయం 7 నుంచే మొదలయ్యే ఎండ సాయంత్రం 7 అయినా తగ్గడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరు చినుకులు ( Rains ) ఉపశమనం కలిగించాయి.
వేసవి ప్రారంభానికే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ( Telangana ) కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు దాటేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించేలా వడగాలులు వీచాయి.
రైతాంగానికి చల్లని కబురు... గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ సారి నిర్ణీత తేదీకంటే ముందుగానే రానున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్ ఎల్నినో క్షీణత వేగంగా సాగుతుండడంతో.. వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులు, జూన్కల్లా లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలుఅంచనా వేస్తున్నాయి.
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భానుడి భగ.. భగలు కాస్త తగ్గడంతో నగరవాసులకు(Hyderabad) ఎండల నుంచి ఉపశమనం లభించింది. రెండు రోజుల క్రితం 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు మంగళవారం 37-38 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం(Weather) చల్లబడి ఈదురుగాలులు వీస్తుండడంతో వడగాల్పుల తీవ్రత తగ్గింది. ద్రోణి గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్(Gujarat) నుంచి మధ్య మహారాష్ట్ర(Maharashtra) వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం..