Eluru: ఆర్టీసీ బస్సులో దట్టమైన పొగలు
ABN , First Publish Date - 2021-11-12T15:52:03+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం సమీపంలో ఆర్టీసీ బస్సులో దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం సమీపంలో ఆర్టీసీ బస్సులో దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలను గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దింపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు తణుకు నుంచి రాజమండ్రి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.