జడ్పీ చైర్మన ఎర్రబోతులకు సన్మానం
ABN , First Publish Date - 2022-01-24T04:19:11+05:30 IST
కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డికి అభినందన కార్యక్రమం కొలిమిగుండ్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం ప్రజలు నిర్వహించారు.
కొలిమిగుండ్ల, జనవరి 23: కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డికి అభినందన కార్యక్రమం కొలిమిగుండ్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం ప్రజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కర్రా హర్షవర్ధనరెడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డికి పూలమాలలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ అంబటి గురివిరెడ్డి, వైసీ పీ యువ నాయకుడు నందకిశోర్రెడ్డి, పేరం సత్యనారాయణరెడ్డి, వైసీపీ కార్యకర్తలు, సర్పంచలు, ఎంపీటీసీలు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.