సర్వేయర్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అబ్దుల్మన్నన
ABN , First Publish Date - 2022-01-24T04:20:30+05:30 IST
ఆత్మకూరు తాలూకా సర్వేయర్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అబ్దుల్మన్నన ఎన్నికయ్యారు.
ఆత్మకూరు రూరల్, జనవరి 23: ఆత్మకూరు తాలూకా సర్వేయర్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అబ్దుల్మన్నన ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా సర్వేయర్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆత్మకూరు తాలూకా సర్వేయర్ల ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘం అఽధ్యక్షుడిగా అబ్దుల్మన్నన, ఉపాఽధ్యక్షుడిగా సురేంద్ర భరతరాజు, కార్యదర్శిగా ప్రణయ్, కోశాధికారిగా విజయ్కిరణ్, సంయుక్త కార్యదర్శిగా ఉదయ్కిరణ్ దాస్, సభ్యులుగా వెంకటేష్, జాషువా, మల్లేశ్వరి, గని మహబూబ్ బాషాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.