11 మంది సైనికులకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-10T18:55:10+05:30 IST
ఇండో-టిబెట్ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరి
పెరంబూర్(చెన్నై): ఇండో-టిబెట్ సరిహద్దు భద్రతా దళ శిక్షణా కేంద్రంలోని 11 మంది సైనికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరిని శివగంగ ప్రభుత్వాస్పత్రిలోని కరోనా ప్రత్యేక వార్డుకు తరలించారు. శివగంగ జిల్లా ఇలుపకుడిలోని ఇండో-టిబెట్ సరిహద్దు భద్రత దళ శిక్షణ కేంద్రంలో మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాలకు చెందిన 500 మంది శిక్షణ పొందుతున్నారు. వీరికి గురువారం కరోనా పరీక్షలు నిర్వహిం చగా, మహారాష్ట్రకు చెందిన 11 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తరలించిన ఆరోగ్యశాఖ అధికారులు, మరికొందరి ఫలితాలు రావాల్సి ఉందన్నారు.