తమిళనాడులో కరోనా కల్లోలం.. నేడు 1162 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-06-02T00:48:21+05:30 IST

తమిళనాడు రాష్ట్రం నెమ్మదిగా కరోనా కబందహస్తాల్లో బందీ అవుతోంది. రోజూ వెయ్యి కేసులకు పైగా ఇక్కడ...

తమిళనాడులో కరోనా కల్లోలం.. నేడు 1162 కేసులు నమోదు

చెన్నై: తమిళనాడు రాష్ట్రం నెమ్మదిగా కరోనా కబందహస్తాల్లో బందీ అవుతోంది. రోజూ వెయ్యి కేసులకు పైగా ఇక్కడ నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,162 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిపై ఓ నివేదికను విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,162 కరోనా కేసులు నమోదయ్యాయని, 11 మంది మృత్యువాత పడ్డారని ఆ నివేదిక ద్వారా తెలిపింది. అంతేకాకుండా నేడు 413 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 23,495కు చేరిందని, 184 మంది మరణించారని తెలిపింది. ఇప్పటివరకు 13,170 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 10,141 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వివరించింది.

Updated Date - 2020-06-02T00:48:21+05:30 IST