కొవిడ్కు మరో 12 మంది మృతి
ABN , First Publish Date - 2021-06-18T06:51:07+05:30 IST
జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా రోజువారీ మరణాలు తగ్గడంలేదు.
జిల్లాలో 1499కి చేరిన కొవిడ్ మరణాలు
తాజాగా 937 మందికి పాజిటివ్
తిరుపతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా రోజువారీ మరణాలు తగ్గడంలేదు. ఇప్పటికీ కనిష్ఠంగా 9 మంది నుంచి గరిష్ఠంగా 12 మంది వరకూ రోజూ మరణిస్తున్నట్టు ప్రభుత్వ బులెటిన్ వెల్లడిస్తోంది. బుధ, గురువారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొవిడ్తో 12 మంది మృతిచెందారు. దీంతో గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ కొవిడ్తో సంభవించిన అధికారిక మరణాల సంఖ్య 1499కి చేరింది. తాజాగా 937 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 211535కు చేరింది. గురువారం ఉదయానికి జిల్లాలో 10208 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన 937 పాజిటివ్ కేసుల్లో.. తిరుపతి నగరంలో 80, ఐరాలలో 43, చిత్తూరులో 39, పూతలపట్టులో 38, మదనపల్లెలో 33, తిరుపతి రూరల్, పలమనేరు మండలాల్లో 31 వంతున, పుత్తూరులో 29, గంగవరంలో 28, జీడీనెల్లూరులో 27, బంగారుపాళ్యంలో 26, పుత్తూరు, తవణంపల్లె మండలాల్లో 24 చొప్పున, నారాయణవనంలో 23, ములకలచెరువులో 21, రేణిగుంటలో 19, కుప్పంలో 18, శ్రీకాళహస్తి, పాలసముద్రం మండలాల్లో 16 చొప్పున, పాకాల, వరదయ్యపాళెం మండలాల్లో 15 చొప్పున, కేవీపల్లె, శ్రీరంగరాజపురం మండలాల్లో 14 వంతున, పీటీఎం, రామకుప్పం, వాల్మీకిపురం మండలాల్లో 13 చొప్పున, బి.కొత్తకోట, గుర్రంకొండ మండలాల్లో 12 వంతున, నాగలాపురం, వి.కోట, ఏర్పేడు మండలాల్లో 11 వంతున, చంద్రగిరి, కురబలకోట, తొట్టంబేడు, ఎర్రావారిపాలెం మండలాల్లో 10 చొప్పున, పుంగనూరు, యాదమరి మండలాల్లో 9 చొప్పున, చిన్నగొట్టిగల్లు, కేవీబీపురం మండలాల్లో 8 వంతున, బైరెడ్డిపల్లె, బీఎన్ కండ్రిగ, కలికిరి, పెద్దమండ్యం, సత్యవేడు, వెదురుకుప్పం మండలాల్లో 7 చొప్పున, కలకడ, కార్వేటినగరం, పెనుమూరు మండలాల్లో 6 వంతున, నగరి, పులిచెర్ల, సోమల మండలాల్లో 5 వంతున, తంబళ్లపల్లె, వడమాలపేట మండలాల్లో 4 చొప్పున, పిచ్చాటూరు, రామచంద్రాపురం, విజయపురం మండలాల్లో 3 వంతున, గుడిపాల, నిండ్ర, పెద్దపంజాణి, రామసముద్రం, రొంపిచెర్ల మండలాల్లో 2 చొప్పున, చౌడేపల్లె, గుడుపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.