పంజా నిర్మాణానికి రూ.1.28 లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-06-22T06:11:09+05:30 IST
మామిడికుదురులో నిర్మిస్తున్న హజరత్ ఇమామ్రజా పంజాకు నగరం టీచర్స్ అసోసియేషన్ తరపున రూ.1.28లక్షల విరాళాన్ని సభ్యులు సోమవారం అందజేశారు.
మామిడికుదురు, జూన్ 21: మామిడికుదురులో నిర్మిస్తున్న హజరత్ ఇమామ్రజా పంజాకు నగరం టీచర్స్ అసోసియేషన్ తరపున రూ.1.28లక్షల విరాళాన్ని సభ్యులు సోమవారం అందజేశారు. వారికి పంజా ముతవలి సర్కిల్ పకార్ సాహెబ్ కృతజ్ఞతలు తెలిపారు. పంజాలో ప్రాచుర్యం పొందిన స్తంభం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో నన్నేసా హుస్సేన్, ఇంతియాజ్ అస్కరి, సయ్యద్రూహి, రజాఅబ్బాస్, షబ్బీర్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.