17 నుంచి వేరుశనగ సబ్సిడీ విత్తన కాయల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-14T04:57:05+05:30 IST
ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లాలో వేరుశనగ సబ్సిడీ విత్తన కాయల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కలికిరి, మే 13: ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లాలో వేరుశనగ సబ్సిడీ విత్తన కాయల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విత్తనాభివృద్ధి సంస్థ తగిన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఆదేశాలు జారీ చేశారు.