కరోనా ఎంత స్పీడ్‌గా సోకుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ..!

ABN , First Publish Date - 2020-07-14T02:32:41+05:30 IST

బీహార్‌లో ఆదివారం నాడు ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన 20 మందికి...

కరోనా ఎంత స్పీడ్‌గా సోకుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ..!

బిహ్తా: బీహార్‌లో ఆదివారం నాడు ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన 20 మందికి కరోనా సోకింది. బీహార్‌లోని బిహ్తా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో.. బిహ్తా ప్రాంతం మొత్తాన్ని సీల్ చేసి కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. బిహ్తా ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త రాజ్ కుమార్ అంత్యక్రియలు జూలై 10న జరిగాయి. ఈ అంత్యక్రియలకు హాజరైన అతని మేనల్లుడికి తొలుత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతరం.. రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన మరొకరు కరోనా బారిన పడ్డారు.


దీంతో.. ఈ అంత్యక్రియలకు హాజరైన 37 మందికి కరోనా టెస్టులు చేశారు. వీరిలో.. 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బీహార్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16642కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 5001. బీహార్‌లో ఇప్పటివరకూ 143 మంది కరోనా వల్ల మరణించారు.


Updated Date - 2020-07-14T02:32:41+05:30 IST