పంజాబ్లో కొత్తగా 21 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-26T01:39:50+05:30 IST
పంజాబ్లో కొత్తగా 21 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో కలుపుకొని మొత్తం కేసుల...
చండీఘర్: పంజాబ్లో కొత్తగా 21 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 2,081కి చేరినట్లు తెలిపింది. ఇప్పటివరకు 1,913 కోలుకుని డిశ్చార్జ్ కాగా 128 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఆసుపత్రుల్లో ఉన్న వారిలో ఆక్సిజన్ సహాయంతో ఊపిరి తీసుకుంటున్న బాధితులు ఇద్దరు ఉండగా.. ఒకరు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని వివరించింది. ఇదిలా ఉంటే 2వేలకు పైగా కేసులు నమోదైనప్పటికీ అతి తక్కువ యాక్టివ్ కేసులు కలిగిన రాష్ట్రంగా పంజాబ్ నిలిచినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.