జైలు గోడ కూలి 22 మంది ఖైదీలకు గాయాలు!
ABN , First Publish Date - 2021-07-31T16:34:27+05:30 IST
మధ్యప్రదేశ్లోని భిండ్ జి్ల్లా జైలులో ఈ రోజు...
భోపాల్: మధ్యప్రదేశ్లోని భిండ్ జి్ల్లా జైలులో ఈ రోజు ఒక బ్యారక్ గోడ కూలిపోవడంతో మొత్తం 22 మంది ఖైదీలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భిండ్ పోలీసు అధికారి మనోజ్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున ఆరవ నంబరు బ్యారక్లో ఈఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఖైదీలు ప్రస్తుతం గ్వాలియర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడినవారికి జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం జైలులో 255 మంది ఖైదీలు ఉన్నారు. జైలు భవనం పునాతనమైనది కావడానికి తోడు, భారీ వర్షాలు కురుస్తున్నందున గోడ బాగా నానిపోయి, కూలిపోయిందని పోలీసులు తెలిపారు.