229 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-24T11:22:30+05:30 IST
జిల్లాలో కొత్తగా 229 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 54,720కు చేరింది. వీరిలో 2,534 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 51,753 మంది డిశ్చార్జి అ
కర్నూలు(హాస్పిటల్), సెప్టెంబరు 23: జిల్లాలో కొత్తగా 229 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 54,720కు చేరింది. వీరిలో 2,534 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 51,753 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఇద్దరు కొవిడ్తో మృతి చెందగా..
మరణాల సంఖ్య 453కు చేరింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ విభాగంలో పని చేస్తున్న అధికారికి కరోనా సోకింది. ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆ అధికారిని సిబ్బంది అందరూ కలవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.