27 నుంచి రాట్నాలమ్మ తిరునాళ్లు
ABN , First Publish Date - 2021-04-14T05:17:40+05:30 IST
రాట్నాలకుంట రాట్నాలమ్మ తిరునాళ్ళ మహోత్సవాలు ఈనెల 27 నుంచి ఐదురోజులపాటు జరుగుతాయని ఈవో కలగర శ్రీనివాసు తెలిపారు.
పెదవేగి, ఏప్రిల్ 13 : రాట్నాలకుంట రాట్నాలమ్మ తిరునాళ్ళ మహోత్సవాలు ఈనెల 27 నుంచి ఐదురోజులపాటు జరుగుతాయని ఈవో కలగర శ్రీనివాసు తెలిపారు. ఏపీ ఆయిల్ ఫెడ్ రైతు కమిటీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు, రాణి దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ చల్లగొళ్ళ వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యుల సమక్షంలో ఉత్సవాలకు సంబంధించిన రాటను ఉగాది రోజున శాస్త్రోక్తంగా నిలబెట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదురోజులపాటు తిరునాళ్ళు జరుగుతాయని, ఉత్సవాల్లో పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు నిర్వహిస్తామన్నారు. చివరిరోజున భారీ అన్నసమారాధన ఉంటుందన్నారు. ఉదయం పంచాంగ పఠనం కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో ఆలయ అర్చకుడు పావులూరి వీరవెంకట రామసత్యనారాయణశర్మ ప్లవ నామ సంవత్సరంలో రాశిఫలాలు వినిపించారు. ఈ ఏడాది మొత్తంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయన్నారు.