ముంబై మురికివాడ ధారావిలో రెండో కరోనా కేసు
ABN , First Publish Date - 2020-04-02T23:33:47+05:30 IST
ధారావిలో రెండో కరోనా కేసు నమోదైంది. 52 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు బారిన పడినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారి ఒకరు...
ముంబై: ధారావిలో రెండో కరోనా కేసు నమోదైంది. 52 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు కోవిడ్-19 బారిన పడినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలా ఉంటే బాధితుడు వోర్లి ప్రాంతంలో నివశించేవాడని, అయితే పారిశుధ్య పనులు మాత్రం ధారావిలో నిర్వహించేవాడని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతడికి పరీక్ష చేయించామని, పాజిటివ్ రావడంతో వెంటనే ఐసోలేషన్కు పంపి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని ఆ అధికారి తెలిపారు. అంతేకాకుండా అతడి కుటుంబ సభ్యులతోపాటు 23 మంది తోటి ఉద్యోగులను కూడా క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించినట్లు వివరించారు.