ప్రైవేటు కరోనా డాక్టర్లపై కేసు! రోగులకు కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసీ..
ABN , First Publish Date - 2020-06-01T22:45:57+05:30 IST
చికిత్స కోసం తమ వద్దకు వచ్చిన రోగుల వివరాలను గోప్యంగా ఉంచిన ముగ్గురు ప్రైవేటు డాక్టర్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.
లక్నో: చికిత్స కోసం తమ వద్దకు వచ్చిన రోగుల వివరాలను గోప్యంగా ఉంచిన ముగ్గురు ప్రైవేటు డాక్టర్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. రోగుల్లో జలుబూ, జ్వరం వంటి కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ ప్రభుత్వానికి వారి వివరాలు ఇవ్వనందుకు వారిపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ప్రైవేటు డాక్టర్లు..కరోనా లక్షణాలున్న రోగుల వివరాలను ఆరోగ్య శాఖకు అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘించిన డాక్టర్లు అరుణ్ కుమార్, ఎమ్ఎల్ గార్గ్, హేమంత్ కుమార్కు చెందిన క్లీనిక్లను స్థానిక అధికారులు సీలు వేశారు. ఎపిడమిక్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేశారు.