30 నిమిషాల్లోనే 300 దర్శన టికెట్ల కోటా పూర్తి

ABN , First Publish Date - 2021-06-17T15:46:06+05:30 IST

తిరుమల శ్రీవారి..

30 నిమిషాల్లోనే 300 దర్శన టికెట్ల కోటా పూర్తి

తిరుమల: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఆన్‌లైన్‌లో విడుదలైన 30 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు. జూన్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గత నెలాఖరులో విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 22, 23, 24 తేదీల్లో జ్యేష్టాభిషేక ఉత్సవాలు ఉండటంతో ఆ మూడు రోజులను మినహాయించి మిగిలిన రోజులకు ఐదు వేల చొప్పున టికె ట్లను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ మూడు రోజులకు సంబంధించిన 15 వేల టికెట్లను బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. టికెట్లు విడుదలైన 30 నిమిషాల్లోనే భక్తులు టికెట్లను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుతున్న క్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. రూ.300 దర్శనం తప్ప మరే అవకాశం లేకపోవడంతో ఈ టికెట్ల కోసం భక్తులు పోటీ పడ్డారు.

Updated Date - 2021-06-17T15:46:06+05:30 IST