3,192 మంది హాజరు

ABN , First Publish Date - 2020-09-24T11:20:26+05:30 IST

సచివాలయ పరీక్షలు నాలుగో రోజు కొనసాగాయి. నగర పరిధిలోని 9 కేంద్రాలలో అభ్యర్థులు బుధవారం పరీక్షలు రాశారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ పరీక్షలు ఉదయం జరిగాయి. 1,666 మంది దరఖా

3,192 మంది హాజరు


నాలుగో రోజు సచివాలయ పరీక్షలు


కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 23: సచివాలయ పరీక్షలు నాలుగో రోజు కొనసాగాయి. నగర పరిధిలోని 9 కేంద్రాలలో అభ్యర్థులు బుధవారం పరీక్షలు రాశారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ పరీక్షలు ఉదయం జరిగాయి. 1,666 మంది దరఖాస్తు చేసుకోగా 1,343 మంది హాజరు అయ్యారు. 323 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 6 కేంద్రాలలో వార్డు ఎడ్యుకేషన్‌ డేటా ప్రొసెసింగ్‌ సెక్రటరీ పరీక్షలు జరిగాయి. 2,664 మంది దరఖాస్తు చేసుకోగా 1,849 మంది హాజరయ్యారు.


815 మంది గైర్హాజరయ్యారు. రెండు పరీక్షలకు కలిపి 4,330 మందికి గాను 3,192 మంది హాజరయ్యారు. 1,138  మంది గైర్హాజరయ్యారు. ఓఎంఆర్‌ షీట్లను నాగార్జున యూనివర్సిటీకి పంపించారు. నగరంలోని 5  కేంద్రాలలో  గురువారం పరీక్షలు నిర్వహిస్తామని జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య తెలిపారు. ఉదయం 2 కేంద్రాలలో 1,145 మందికి, మధ్యాహ్నం 3 కేంద్రాలలో 2,296 మందికి పరీక్షలు రాసే ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ, ఏఎన్‌ఎం అండ్‌ వార్డు హెల్త్‌ సెక్రటరీ ఉద్యోగాలకు గురువారం  పరీక్షలు జరుగుతాయి.


Updated Date - 2020-09-24T11:20:26+05:30 IST