35 మందికి Covid పాజిటివ్...
ABN , First Publish Date - 2022-01-05T17:24:28+05:30 IST
కర్ణాటకలోని శ్రీరంగపట్నం నుంచి తమిళనాడులోని మేల్మరు వత్తూరు ఆదిపరాశక్తి పీఠాన్ని సందర్శించిన 35 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. శ్రీరంగపట్నం నుంచి మూడు బస్సుల్లో వంద మంది రాష్ట్రంలో తీరథయాత్రలకు
చెన్నై: కర్ణాటకలోని శ్రీరంగపట్నం నుంచి తమిళనాడులోని మేల్మరు వత్తూరు ఆదిపరాశక్తి పీఠాన్ని సందర్శించిన 35 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. శ్రీరంగపట్నం నుంచి మూడు బస్సుల్లో వంద మంది రాష్ట్రంలో తీరథయాత్రలకు వచ్చారు. ఒక్కో బస్సులో 35 మంది ప్రయాణించారు. చివరగా రెండు రోజులకు ముందు ఆదిపరాశక్తి పీఠాన్ని దర్శించుకుని స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లిన వారికి కరోనా ముందస్తు వైద్యపరీక్షలు జరపగా, అందులో 35 మందికి పాజిటివ్గా తేలింది. మేల్మరువత్తూరు నుంచి కర్ణాటకకు రెండు బస్సులు మాత్రమే తిరిగి వెళ్లాయి. మూడో బస్సు ఇంకా ఆ రాష్ట్రానికి చేరలేదు. ఆ బస్సులోని ప్రయాణికులు మేల్మరువత్తూరును దర్శించిన తర్వాత రాష్ట్రంలో మరికొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆ బస్సులోని ప్రయాణికులు స్వరాష్ట్రానికి తిరిగిరాగానే వైద్య పరీక్షలు జరుపుతామని పేర్కొన్నారు. మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి పీఠాన్ని దర్శించిన 35 మందికి కరోనా వైరస్ సోకిన వార్త వెలువడగానే ఆ పీఠం వద్ద ఆరోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం ముమ్మర తనిఖీలు జరుపుతున్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.