లడఖ్లో 36 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-08T03:34:44+05:30 IST
లడఖ్లో మంగళవారం కొత్తగా 36 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
లేహ్ : లడఖ్లో మంగళవారం కొత్తగా 36 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యాక్టివ్ కేసుల సంఖ్య 180కి చేరింది.
అధికారిక లెక్కల ప్రకారం, లేహ్లో 115 కేసులు, కార్గిల్లో 65 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్న 24 మందిని ఆసుపత్రి నుంచి విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. మంగళవారం కొత్తగా 22,252 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 467 మంది ఈ వ్యాధితో మరణించారు. మన దేశంలో పది లక్షల జనాభాకు ఒకరు కోవిడ్-19తో మరణిస్తున్నారని, ఇది ప్రపంచంలో అతి తక్కువ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.