380 తిమింగలాల మృత్యువాత... ఇదే ప్రప్రథమం

ABN , First Publish Date - 2020-09-24T16:11:57+05:30 IST

ఆస్ట్రేలియాలోని టాస్మానియా వెస్ట్ కోస్ట్ సముద్రం ఒడ్డున 380 తిమింగళాలు సముద్రపు తీరానికి

380 తిమింగలాల మృత్యువాత... ఇదే ప్రప్రథమం

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని టాస్మానియా వెస్ట్ కోస్ట్  సముద్రపు తీరంలో 380 తిమింగలాలు చిక్కుకుని మృత్యువాత పడ్డాయి. సోమవారం నాడు ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అయితే బుధ వారం వరకు తాము 50 తిమింగళాలను కాపాడామని, మరో 30 తిమింగలాలను సముద్రంలోకి పంపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.


ఇంత పెద్ద సంఖ్యలో ఒడ్డున చిక్కుకోవడం ఆస్ట్రేలియా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదని, ఇదే ప్రథమమని అధికారులు వెల్లడించారు. మిగితా వాటిని కూడా సురక్షితంగా సముంద్రంలోకి పంపే ప్రయత్నం తాము కొనసాగిస్తూనే ఉన్నామని, సమయం గడిచే కొద్ది వాటి పరిస్థితి చేయి దాటేట్లుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో తిమింగలాలు ఒడ్డులో ఎందుకు చిక్కుకున్నాయో తమకు ఇంకా అర్థం కావడం లేదని, దానిపై అధ్యయనం చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-09-24T16:11:57+05:30 IST