483 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-06-16T07:26:37+05:30 IST

ల్లాలో మంగళవారం కొత్తగా 483 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

483 పాజిటివ్‌ కేసులు

724 మంది డిశ్చార్జి.. నలుగురి మృతి 

కొత్తగా ఆరు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 15 : జిల్లాలో మంగళవారం కొత్తగా 483 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా ఒంగోలు నగరంలో 43 ఉన్నాయి. కందుకూరు అర్బన్‌లో 25, ఒంగోలు రూరల్‌లో 22, పామూరు 22, అద్దంకి అర్బన్‌ 16, కనిగిరి అర్బన్‌ 16, టంగుటూరు 16, చీమకుర్తి అర్బన్‌ 15, కొండపి 15, నాగులుప్పలపాడులో  14 నిర్ధారణ అయ్యాయి. సంతనూతలపాడులో 14, కొరిశపాడు 13, చీరాల 12, గిద్దలూరు 12, పర్చూరు 12, ఉలవపాడు 12, హనుమంతునిపాడు 10, కొత్తపట్నం 10, దర్శిలో 10 వెలుగు చూశాయి. ఇతర ప్రాంతాల్లోనూ పలువురుకి వైరస్‌ సోకింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 724 మంది మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. నలుగురు మృతి చెందారు.  జిల్లాలో గడచిన 24 గంటల్లో  కొత్తగా ఆరు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీటిని కలుపుకొని ఒంగోలు రిమ్స్‌లో మొత్తం 81 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరుగురికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.  


Updated Date - 2021-06-16T07:26:37+05:30 IST