పాక్‌లో నీచాతినీచం! మేకను 5గురు ఘోరంగా..

ABN , First Publish Date - 2021-07-30T02:52:51+05:30 IST

పాకిస్థాన్‌లో పైశాచికత్వం పతాకస్థాయికి చేరింది. ఐదుగరు నరరూప రాక్షసులు ఓ మేకపై అత్యాచారానికి పాల్పడ్డారు.

పాక్‌లో నీచాతినీచం!  మేకను 5గురు ఘోరంగా..

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో పైశాచికత్వం పతాకస్థాయికి చేరింది. ఐదుగరు నరరూప రాక్షసులు ఓ మేకపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది చాలదన్నట్టు ఆ మూగజీవాన్ని అత్యంత కర్కశంగా చిత్రహింసలకు గురి చేసి ఆపై చంపేశారు. ఒకారా జిల్లాలో ఇటీవల ఈ దారుణం జరిగింది. అదే ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తికి చెందిన మేకను నిందితులు దొంగిలించి ఈ దారుణానికి పాల్పడ్డట్టు స్థానికులు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దారుణం ప్రస్తుతం పాకిస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి ప్రజలు మరోసారి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 


మహిళల వస్త్రధారణ సంప్రదాయ బద్ధంగా ఉంటే అఘాయిత్యాలు జరగవంటూ గతంలో ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పాక్ నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ‘‘ఇక జంతువులు కూడా బుర్ఖా ధరిస్తే మంచిదంటారా’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి పాక్ నటీమణి మథిరా ఇన్‌స్టాగ్రామ్‌లో మండిపడ్డారు. ‘‘నగ్నంగా ఉండే జంతువులను చూసి కూడా పురుషులు చలిస్తారా..? ఇప్పుడు మన హాండ్‌సమ్ ప్రధాని..మేకలు కూడా బుర్ఖా ధరించాలని సూచిస్తారేమో’’ అంటూ మరొక నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పాక్‌లో మహిళలపై నేరాలు పెరుగుతుండటంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఘటన అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది.  

Updated Date - 2021-07-30T02:52:51+05:30 IST