579 కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-08-12T11:21:27+05:30 IST
జిల్లాలో కొత్తగా మరో 579 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల
ఆరుగురు మృతి
కడప, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మరో 579 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,640కి చేరుకుంది. మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 154కు చేరుకుంది. కాగా ఫాతిమా, రిమ్స్ కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 874 మంది డిశ్చార్జి అయినట్లు కలెక్టరు వివరించారు.
19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు జైలు సూపరింటెండెంట్ రవికిరణ్ తెలిపారు. రెండు రోజుల క్రితం సెంట్రల్ జైలులో స్వాబ్ పరీక్షలు నిర్వహించగా తొలుత ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారితో కలిసి తిరుగుతున్న మరికొందరికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం 19 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.