400కిమీలు ప్రయాణించి.. కరోనా అని తేలిన కాసేపటికే పసికందు మృతి!

ABN , First Publish Date - 2020-07-08T03:21:40+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఎనిమిది నెలల పసికందును తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

400కిమీలు ప్రయాణించి.. కరోనా అని తేలిన కాసేపటికే పసికందు మృతి!

షిల్లాంగ్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఎనిమిది నెలల పసికందును తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయడం కుదరదని తెలిసి 400కిమీలు ప్రయాణించారు. పక్కరాష్ట్రంలోని మరో హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు పిల్లాడికి కరోనా అని తేల్చారు. ఈ విషయం తెలిసిన కాసేపటికే ఆ పసికందు కన్నుమూసింది. ఈ ఘటన మేఘాలయలో జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట తమ బిడ్డను తీసుకొని మేఘాల చేరుకుంది. ఇక్కడ ఆస్పత్రిలో చేర్పించిన కాసేపటికి ఆ పసికందుకు చేసిన కరోనా టెస్టులో పాజిటివ్ ఫలితం వచ్చిందని, ఆ తర్వాత కాసేపటికే శివువు మరణించిందని మేఘాలయ ఆరోగ్యశాఖా మంత్రి ఆల్ హెక్ వెల్లడించారు.

Updated Date - 2020-07-08T03:21:40+05:30 IST