హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2021-01-21T05:41:05+05:30 IST
తాలుకా పోలీ్సస్టేషన్ పరిధిలో గత ఏడాది డిసెంబరు 9న జరిగిన చంద్రమణి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు.
కర్నూలు, జనవరి 20: తాలుకా పోలీ్సస్టేషన్ పరిధిలో గత ఏడాది డిసెంబరు 9న జరిగిన చంద్రమణి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. డీఎస్పీ మహేష్, తాలుకా సీఐ విక్రమసింహ తెలిపిన వివరాల మేరకు నిందితులు నీలిశికారి శివాజి, షేక్ శాలిమియ, షేక్ అక్బర్ బాషా, రంగస్వామి, అడవి రాముడు, నాగపుల్లయ్య, షేక్ జహంగీర్, రెడ్డిపోగు చెంచన్నలను అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన శివాజీ, చంద్రమణి ఇద్దరు స్నేహితులు. శివాజీ భార్యతో చంద్రమణి కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై పలుసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రమణిని చంపాలని మిగతా ఏడుగురు నిందితులకు రూ.2.5 లక్షల కాంటాక్టు ఒప్పందం చేసుకున్నాడు. మిగతా నిందితులు చంద్రమణితో స్నేహం చేసి నమ్మకం కుదిరిన తర్వాత మద్యం తాగేందుకు అని మునగాలపాడు గ్రామ సమీపంలో ఉన్న కేసీ కెనాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు మద్యం తాగిన తర్వాత మత్తులో ఉండయ్య, రోకలిబండతో చంద్రమణిని చంపేశారు. ఈ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి, ఓ ఆటో, మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.