82 ఏళ్ల బామ్మ.. ఆక్సిజన్ సమస్యను ఎలా ఎదుర్కొందంటే..!
ABN , First Publish Date - 2021-04-30T16:39:00+05:30 IST
ప్రస్తుత కరోనా కలంలో దేశాన్ని ఆక్సిజన్ సమస్య పట్టి పీడిస్తోంది
ప్రస్తుత కరోనా కాలంలో దేశాన్ని ఆక్సిజన్ సమస్య పట్టి పీడిస్తోంది. కరోనా బారిన పడుతున్న చాలా మందికి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. దాంతో ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే ఈ సమస్యకు బోర్లా పడుక్కోవడం (ప్రోనింగ్) కొంత ఉపశమనం కలిగిస్తుందని ఇటీవలి కాలంలో వైద్యులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని గోరక్పూర్కు చెందిన 82 ఏళ్ల బామ్మ ఈ ప్రోనింగ్ టెక్నిక్స్తోనే కరోనా బారి నుంచి తప్పించుకుంది. అలీ నగర్కు చెందిన ఓ బామ్మకు కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన కొద్ది రోజులకే ఆమె అక్సిజన్ స్థాయిలు 79కి పడిపోయాయి. ఆ సమయంలో ప్రోనింగ్ ప్రారంభించడంతో నాలుగు రోజుల్లో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 94కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 97గా ఉన్నాయని ఆమె కుమారుడు తెలిపారు.