మహారాష్ట్రను కలవరపెడుతున్న మరో భయం..!

ABN , First Publish Date - 2020-05-29T02:28:32+05:30 IST

మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా...

మహారాష్ట్రను కలవరపెడుతున్న మరో భయం..!

ముంబై: మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. కొత్తగా మహారాష్ట్రను మరో భయం వెంటాడుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా ఉన్నట్టుండి పెరిగింది. గురువారం కూడా మహారాష్ట్రలో కొత్తగా 2598 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాదు, మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.


మహారాష్ట్రలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో గురువారం ఒక్కరోజే 85 మంది మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. కరోనా మరణాల సంఖ్య మహారాష్ట్రలో 1982కు చేరింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,546కు చేరింది. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 38939. గురువారం కరోనా నుంచి కోలుకున్న 698 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకూ 18616 మంది మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్నారు.





Updated Date - 2020-05-29T02:28:32+05:30 IST