chennai: సర్పంచ్‌గా ఎన్నికైన 90 ఏళ్ళ బామ్మ !

ABN , First Publish Date - 2021-10-14T16:19:55+05:30 IST

తిరునల్వేలి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా తొంభైయేళ్ల బామ్మ గెలిచారు. పాళయంకోట సమీపం శివందిపట్టికి చెందిన పెరుమాత్తాళ్‌ (90) గ్రామసర్పంచ్‌ పదవికి పోటీ చేశారు. మంగళ

chennai: సర్పంచ్‌గా ఎన్నికైన 90 ఏళ్ళ బామ్మ !

చెన్నై: తిరునల్వేలి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా తొంభైయేళ్ల బామ్మ గెలిచారు. పాళయంకోట సమీపం శివందిపట్టికి చెందిన పెరుమాత్తాళ్‌ (90) గ్రామసర్పంచ్‌ పదవికి పోటీ చేశారు. మంగళవారం ఆ గ్రామసర్పంచ్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తన ప్రత్యర్థులపై ఓట్ల ఆధిక్యత పొందుతూ వచ్చారు. చివరకు తన సమీప ప్రత్యర్థులు ఇరువురిని డిపాజిట్‌ కోల్పోయేలా చేసి ఘనవిజయం సాధించారు. ఎన్నికల అధికారి నుంచి ఆమె ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించేటప్పుడు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గుమికూడి జేజేలు పలికారు. ఈ సందర్భంగా పెరుమాత్థాల్‌ పాత్రికేయులతో మాట్లాడుతూ తన కుటుంబీకులంతా డీఎంకేకు చెందినవారమని, ఈ ఎన్నికలు పార్టీపరంగా నిర్వహించకపోయినా తనకు ఆ పార్టీ సభ్యులందరూ ఓటేశారని చెప్పారు. 

Updated Date - 2021-10-14T16:19:55+05:30 IST