ప్రశాంతంగా ఎంసెట్
ABN , First Publish Date - 2022-07-19T05:04:19+05:30 IST
ఉమ్మడి జిల్లా లో ఎంసెట్ సోమవారం ప్రశాంతంగా కొనసాగింది.తొలిరోజు 1,435 మంది విద్యార్థులకు 1,381 మంది హాజరయ్యారు, 54 మంది గైర్హాజరయ్యారు. ఎంసెట్ను ప్రతీ రోజు రెండు సెషన్లలో ఈనెల 20వ తేదీ వర కు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3గంటల నుం చి 6 గంటల వరకు నిర్వహించారు.
తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 1,381మంది హాజరు
నల్లగొండ, సూర్యాపేటఅర్బన్, కోదాడ,జూలై 18: ఉమ్మడి జిల్లా లో ఎంసెట్ సోమవారం ప్రశాంతంగా కొనసాగింది.తొలిరోజు 1,435 మంది విద్యార్థులకు 1,381 మంది హాజరయ్యారు, 54 మంది గైర్హాజరయ్యారు. ఎంసెట్ను ప్రతీ రోజు రెండు సెషన్లలో ఈనెల 20వ తేదీ వర కు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3గంటల నుం చి 6 గంటల వరకు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్పీఆర్ కేంద్రంలో పరీక్ష కొనసాగింది.ఉదయం జరిగిన పరీక్షకు 180 మంది విద్యార్థులకు, 179మంది హాజరుకాగా,ఒక విద్యార్థి గైర్హాజరయ్యాడు. రెం డో సెషన్లో 182 మందికి, 177 మంది హాజరుకాగా ఐదుగురు గైర్హాజరయ్యారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలో ఉద యం 220మంది విద్యార్థులకు 211మంది హాజరు కాగా, 9మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 223మందికి, 198మంది హాజరుకాగా, 25మంది గైర్హాజరయ్యారు. కోదాడ పట్టణంలోని అనురాగ్లో ఉదయం 216మంది విద్యార్థులకు 212మంది హాజరుకాగా,4గురు గైర్హాజరయ్యారు.సనాలో 100మందికి, 97 మంది హాజరుకాగా, ముగ్గురు గైర్హాజరు అయ్యారు. సాయంత్ర అనురాగ్ లో 214మందికి 208మంది హాజరుకాగా, 6గురు గైర్హాజరయ్యారు. సనా లో 100మందికి 99మంది హాజరుకాగా,ఒక్కరు గైర్హాజరయ్యారు. ఎంసెట్ హాల్టికెట్పై సెంటర్ రూట్మ్యా్పను కూడా ముద్రించడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని నిర్వాహకులు తెలిపారు. కాగా, అగ్రికల్చర్ విభాగం పరీక్షలు ఈనెల 14,15వ తేదీల్లో జరగాల్సి ఉండగా,వర్షాల నేపథ్యంలో ఆ పరీక్షను వాయిదా వేశారు. పరీక్షల తేదీలను ప్రకటించాల్సి ఉంది.
పరీక్ష కేంద్రం కేటాయింపు హాజరు గైర్హాజరు
నల్లగొండ ఎస్పీఆర్ 362 356 6
సూర్యాపేట ఎస్పీ కళాశాల 443 409 34
కోదాడ అనురాగ్ 430 420 10
కోదాడ సన 200 196 4
మొత్తం 1435 1381 54