ముగ్గురు విలేకరులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-01-18T05:25:36+05:30 IST

తనపై తప్పుడు వార్తలు రాసి పరువునకు భంగం కలిగించిన ముగ్గురు విలేకరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హత్నూర తహసీల్దార్‌ జయరాంనాయక్‌ ఆదివారం సాయంత్రం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ముగ్గురు విలేకరులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

హత్నూర, జనవరి 17: తనపై తప్పుడు వార్తలు రాసి పరువునకు భంగం కలిగించిన ముగ్గురు విలేకరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హత్నూర తహసీల్దార్‌ జయరాంనాయక్‌ ఆదివారం సాయంత్రం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను విధి నిర్వహణలో ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా వీడియో, ఫొటోలు తీసి ఇబ్బందులకు గురి చేశారని, మద్యం సేవించి విధులకు హాజరయ్యానని తప్పుడు వార్తలు రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా కొంత కాలంగా తనపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్‌ఐ శ్రీనివా్‌సను సంప్రదించగా.. ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-01-18T05:25:36+05:30 IST