నిష్ప్రయోజన పిల్ వేసినందుకు రూ.10 వేలు ఫైన్
ABN , First Publish Date - 2020-09-25T08:19:24+05:30 IST
ఐఐటీల్లో ఆత్మహత్యలను నియంత్రించేలా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఐఐటీల్లో ఆత్మహత్యలను నియంత్రించేలా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ దాఖలు చేసిన గౌరవ్ బన్సల్ అనే లాయర్కు రూ. 10వేల జరిమానా విధించింది.